భాగ్యనగర సంస్కృతికి నిదర్శనమైన నాంపల్లి నుమాయిష్ 85వ ఎడిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు మొత్తం 46 రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దేశవిదేశాలకు చెందిన సుమారు 2,000 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశ రుసుము రూ.50 కాగా.. ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితం. సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్, మెట్రో రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అగ్నిప్రమాదాల నివారణకు 82 ఫైర్ పాయింట్లు, ప్రత్యేక నిఘా టవర్లను ఏర్పాటు చేశారు.