Thota Chandrasekhar Meet Pawan Kalyan: తోట చంద్రశేఖర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. దీంతో తోట చంద్రశేఖర్ మళ్లీ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తోట చంద్రశేఖర్ 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.