తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఎపిసోడ్ రోజు రోజుకూ ఆసక్తిని రేపుతోంది. తాజాగా.. ఆమె జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, పరకాల టికెట్ అంశం, సీఎం రేవంత్రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. జనసేన నేతలతో సుస్మిత చర్చలు జరుపుతున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ.. ఆమె నుంచి కానీ జనసేన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆమె చేరికపై ఉత్కంఠ కొనసాగుతోంది.