హైదరాబాద్లో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయింది. చికెన్ షాపుల నుంచి సేకరించిన చికెన్ వ్యర్థాలను ఏపీలో చేపల చెరువులకు మేతగా తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు, అధికారులు సంయుక్తంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను సీజ్ చేశారు. రాత్రిపూట లారీల ద్వారా ఈ చికెన్ వ్యర్థాలను ఏపీకి తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి