Doctor Alla Ramaseshaiah: కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ ఆళ్ల రామశేషయ్య పేదలకు రూపాయికే వైద్యం అందిస్తూ వైద్య వృత్తికి సేవకుడిగా నిలుస్తున్నారు. తన కుమారుడి మరణం తర్వాత కంటి ఆసుపత్రిని స్థాపించి, వేలాది మందికి ఉచితంగా కంటి వైద్యం చేశారు. అవయవదానంపై అవగాహన కల్పిస్తూ, తన శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేశారు. నిరుపేదలకు దుస్తులు, వృద్ధులకు చేతి కర్రలు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు.