Losari Bhimavaram Pippara Road Works: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల విస్తరణ దిశగా మరో ముందడుగు పడింది. లోసరి నుంచి పిప్పర రోడ్డును అభివృద్ధికి నిధులు మంజూరు చేయగా.. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులతో మాట్లాడారు. మొదటి ప్యాకేజీ పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు. మొదటి ప్యాకేజీ పనులు ఈ నెలాఖరుకు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ హైవే కోసం మొత్తం రూ.99 కోట్లు మంజూరైన సంగతి తెలిసిందే.