ములుగు జిల్లా చిన్నబోయినపల్లి వద్ద వే బ్రిడ్జి నిర్వాహకులు ఇసుక లారీల తనిఖీల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. లారీ డ్రైవర్లు రెండుసార్లు తూకం వేయించుకుని డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీని వెనుక పోలీసు అధికారి హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.