సీఎం రేవంత్ రెడ్డి ‘రైతునేస్తం’ వేదికగా ఆరోగ్య సలహాలు ఇచ్చారు. జొన్న రొట్టె రోజువారీ తింటే జిమ్లకు అవసరం లేకుండా ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అచ్చంపేట దోసకాయ, కందిపప్పుతో కూడిన వంట రుచి ముందు చికెన్, మటన్ నిలబడవని వివరించారు. ఈ కార్యక్రమంలోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఎకరాల పరిమితి లేకుండా రూ.12,000 చొప్పున అర్హులందరికీ నిధులు అందుతాయని సీఎం తెలిపారు. ప్రభుత్వం హామీల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నేడు ఒక ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.