గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రిని పన్నులు చెల్లించనందుకు సీజ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించాలని కోరుతున్నా ఆసుపత్రి యాజమాన్యం స్పందించడం లేదని అధికారులు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే అధికారులు ఆసుపత్రిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే తమకు మూడు రోజులు గడువు కావాలని కోరతడంతో ఆసుపత్రికి అంటించిన నోటీసులను అధికారులు తొలగించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.