గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దసరా, బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. మూడు రోజులు పాటు కార్నివాల్ తరహాలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా నగరంలోని 11 లక్షల మందికి బతుకమ్మ కానుక ఇవ్వనుంది. ఆ వివరాలు..