హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త! పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేసింది. త్వరలో నగరంలోని 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో కేవలం రూ.5కే టిఫిన్ అందించనుంది. ఇడ్లీ, ఉప్మా, పూరి వంటి వివిధ రకాల టిఫిన్లు ఉదయం 7 నుండి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన, శుచిగా ఉండే టిఫిన్ను తక్కువ ధరకే అందించాలనేది జీహెచ్ఎంసీ లక్ష్యం.