హైదరాబాద్ నగర ప్రజలకు జీహెచ్ఎంసీ ముఖ్య ప్రకటన చేసింది. ఆగస్టు 15, 16 తేదీల్లో నగరంలోని మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, 16న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రెండు రోజులు నగరంలోని అన్ని మాంసం దుకాణాలు, పశువుల వధశాలలను మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. ఆవివరాలు..