బాచుపల్లిలో అపార్ట్మెంట్ కూల్చివేతల నోటీసుల వ్యవహారంపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఆ నోటీసులకు హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ ఆరోపణలను ఖండిస్తూ, ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేవిగా అభివర్ణించారు. పేదలు, సామాన్యులను హైడ్రా ఎప్పుడూ ఇబ్బంది పెట్టదని ఆయన అన్నారు. హైడ్రా పనితీరుపై ప్రజలు ఎంతో స్పష్టతతో ఉన్నారని, అనవసరమైన ఆరోపణలు చేసి ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని హైడ్రా కమిషనర్ కోరారు.