ఛత్తీస్గఢ్లో 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా.. మావోయిస్టు కేంద్రకమిటీ జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. మృతి చెందిన వారిలో నంబాల కేశవరావు సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. ఆపరేషన్ కగార్పై వామపక్షాలు శాంతి చర్చలు కోరగా.. కేంద్రం తగ్గడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలిజం అంతం 2026 మార్చి 31లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు.