ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం పార్టీలన్ని అభ్యర్థులను ప్రకటించే పనిలో తలమునకలయి ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించింది. జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. సునీతను గెలిపించడమే మాగంటి గోపీనాథ్కు ఇచ్చే అసలైన నివాళి అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..