జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో అనివార్యమైన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కవిత ఎంట్రీతో సీన్ మరింత రసవత్తరంగా మారింది.