జూరాల డ్యామ్ సమీపంలో కొత్త బ్రిడ్జి నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం 121.92 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో కూడా జారీ చేసింది. డ్యామ్ మీద వాహనాల రాకపోకలు అధికంగా ఉండటం, భారీ ట్రాఫిక్ వల్ల డ్యామ్కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని డ్యామ్ భద్రతా విభాగం నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వల్ల మూడు జిల్లాల్లో పర్యాటకం, వ్యాపారం అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఆ వివరాలు..