Jc Brothers Family One Sad News: జేసీ బ్రదర్స్ కుటుంబంలో ఒకవైపు విషాదం, మరోవైపు సంతోషం నెలకొన్నాయి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బావ సోమనాథ్ రెడ్డి మరణించడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మనవరాలు రిషికారెడ్డి, విశ్వజిత్ రెడ్డి దంపతులకు కుమారుడు జన్మించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ రెండు సంఘటనలపై జేసీ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు.