పంచ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారికి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు భారీ విరాళం సమర్పించారు. బెంగళూరు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం.. అమ్మవారికి బంగారు కిరీటాన్ని బహూకరించింది. ఏకంగా.. రూ కోటి 60 లక్షల 10 వేల 501 రూపాయలు విలువ చేసే.. 1.587 కిలోల బంగారు కిరీటాన్ని జోగులాంబ ఆలయం ఎండోమెంట్ ఆఫీసర్ పురేందర్, ఛైర్మన్ నాగేశ్వర్రెడ్డి, ధర్మకర్తలకు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి అలంకరించారు.