తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద తెలంగాణకు మరో 200 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులను ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడపనున్నారు.