టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ బాలమందిరం అనాథ పిల్లల జీవితాల్లో నిజమైన జీవనాడిగా నిలుస్తోంది. 5 నుంచి 10 ఏళ్ల వయసు గల అనాథ, నిరుపేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. పదో తరగతిలో ప్రతిభ చూపిన వారికి కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదివించేలా టీటీడీ తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు మరో వరంలా మారింది. అక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు ఐటీ, మెడికల్, ప్రభుత్వ రంగాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడటం విజయానికి నిదర్శనం.