టీటీడీ ఛైర్మన్ నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. భూమన

9 months ago 20
అత్యంత విలువైన టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి. టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారో చెప్పాలన్నారు. తన ప్రశ్నలకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్‌ నాయుడి వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని.. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్‌ కావడం హిందువుల దురదృష్టమన్నారు. బీఆర్ నాయుడు బెదిరింపులకు భయపడేది లేదని.. తనపై చేసే ఆరోపణలకు సీబీఐ విచారణకైనా సిద్ధం అన్నారు. బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై నిరంతరం దూషణలకు దిగుతున్నారన్నారు. క్విడ్‌ప్రో కింద బీఆర్‌ నాయుడికి ఆ పదవి వచ్చిందని.. టీటీడీ ఛైర్మన్ పదవి శాశ్వతం కాదనే విషయం బీఆర్‌ నాయుడు గుర్తుంచుకోవాలి అన్నారు.
Read Entire Article