Renigunta Devotee Donates every penny to TTD:: తిరుమల శ్రీవారికి సోమవారం భారీ విరాళం అందింది. రేణిగుంటకు చెందిన భక్తురాలు శ్రీవారికి అరుదైన కానుక సమర్పించుకున్నారు. విపత్తుల నిర్వహణ అధికారిగా వివిధ దేశాలలో పనిచేసిన మోహన అనే భక్తురాలు.. తన 35 ఏళ్ల సర్వీసులో ఆదా చేసిన మొత్తం టీటీడీకి విరాళంగా అందించారు. 35 ఏళ్ల సర్వీసులో ఆదా చేసిన రూ.50 లక్షలను టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు విరాళంగా అందించారు. అలాగే హీరో మోటో కార్ప్ సంస్థ సైతం టీటీడీకి బైక్ విరాళంగా అందించింది.