టీటీడీకి మరోసారి భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్కు చెందిన రెండు సంస్థలు టీటీడీ బర్డ్ ట్రస్టుకు ఏకంగా రూ.4 కోట్ల వరకూ విరాళాలు అందించాయి. ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా లిమిటెడ్ రూ.2.93 కోట్లు, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1.10 కోట్లు టీటీడీ బర్డ్ ట్రస్టుకు విరాళంగా అందించాయి. ఆయా సంస్థల ప్రతినిధులు విరాళానికి సంబంధించిన చెక్కులను టీటీడీ సిబ్బందికి అందించారు.