నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ప్రసుతం వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి కోటంరెడ్డి అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. మరో వారం రోజులపాటు పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్లు సూచించినట్లు తెలిసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి న్యూరో సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.