Araku Mp Funds To Kovur Constituency: వైెస్సార్సీపీ ఎంపీ టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి నిధులు కేటాయించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజా రాణి తన MP నిధులనుండి రూ. 10 లక్షలు ఇచ్చారన్నారు. కోవూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ మేరకు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ట్వీట్ చేశారు.