కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పాల్గొన్నారు. నీరసంతో ఎండలో విస్తృతంగా పర్యటించడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వర్ల కుమార్ రాజాను విజయవాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు.