Kavali Tdp Mla Faces Cyber Crime Cheating: సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆగస్టు 22న ఆర్టీఏ బకాయిల లింకును క్లిక్ చేయడంతో ఆయన సిమ్ బ్లాక్ అయ్యింది. సిమ్ తిరిగి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన రెండు బ్యాంక్ ఖాతాల నుండి రూ. 23 లక్షలకు పైగా మాయమైంది. ఆలస్యంగా తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.