Mahasena Rajesh Father Died: టీడీపీ నేత మహాసేన రాజేష్ ఇంట విషాద ఘటన జరిగింది.. రాజేష్ తండ్రి సాధు సుందరసింగ్ ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.. సోమవారం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. సుందర సింగ్ మరణంపై మంత్రి నారా లోకేష్ సంతపాన్ని తెలిపారు. రాజేష్కు ఫోన్ చేసి పరామర్శించినట్లు లోకేష్ ట్వీట్ చేశారు. సాధు సుందరసింగ్ మరణంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపాన్ని తెలియజేశారు.