Sugavasi Subramanyam Quits Tdp: ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజంపేట నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పార్టీని వీడుతున్నట్లు చంద్రబాబుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. రాజంపేట టీడీపీలో గ్రూప్ వార్ నడుస్తుండటం, పాలకొండ్రాయుడు మరణంపై చంద్రబాబు స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజీనామాపై అధిష్టానం స్పందించాల్సి ఉంది.