Pusapati Ashok Gajapathi Raju: మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్గా ఆయన నియమితులైనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాసరావులకు ఆయన రాజీనామా లేఖను పంపారు. పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు, టీడీపీ కార్యకర్తగా తనకు సేవ చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా అనంతరం ఆయన భావోద్వేగానికి గురయ్యారు.