టీనేజ్ యువతుల్లో పెరుగుతున్న రక్తహీనత, ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 14-18 ఏళ్ల యువతులకు నెలకు 15 మిల్లెట్, పల్లి పట్టీలను అంగన్వాడీల ద్వారా పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఖమ్మం, ములుగు, అసిఫాబాద్లలో మొదట అమలు కానున్న ఈ పథకం ద్వారా పోషకాహారం అందించడంతో పాటు మహిళా రక్షణపై అవగాహన కల్పిస్తారు.