హైదరాబాద్లోని ఇందిరా పార్కు అంతర్జాతీయ స్థాయి టూరిస్ట్ స్పాట్గా మారనుంది. కర్ణాటకలోని బృందావన్ గార్డెన్స్ తరహాలో అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ట్యాంక్బండ్తో ర్యాంప్ ద్వారా అనుసంధానం, ఎత్తైన టవర్పై హోటల్, చెరువు పునరుద్ధరణ, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటుగా ట్యాంక్బండ్, నెక్లస్రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్లను కలుపుతూ ట్రాక్లు నిర్మించనున్నారు.