హైదరాబాద్ చర్లపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఓ తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయింది. శ్వేత అనే గృహిణి, తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తింటికి బయల్దేరగా.. పొరపాటున వేరే బోగీ ఎక్కింది. చర్లపల్లి స్టేషన్లో సరైన బోగీలోకి మారే క్రమంలో రైలు కదలడంతో ఆమె రైలు, ప్లాట్ఫాం మధ్య పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక దృశ్యం చూసిన చిన్నారులు, భర్త వెంకటేష్ గుండెలవిసేలా రోదించారు.