కాజీపేట-బల్లార్షా మార్గంలో మూడో లైన్ పనుల కారణంగా కాగజ్నగర్-మంచిర్యాల మధ్య పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే జూన్ 20 వరకు రద్దు చేసింది. రామగిరి, బల్లార్షా, సింగరేణి, భాగ్యనగర్, ఇంటర్సిటీ, కాగజ్నగర్ సూపర్ఫాస్ట్, నాగ్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు రద్దయ్యాయి. దీంతో నిత్యం రైళ్లలో ప్రయాణించే వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.