కొత్త ఏడాది జనవరి 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్తో సహా 25 రైళ్ల వేళల్లో 5 నుంచి 30 నిమిషాల వరకు వ్యత్యాసం ఉండనుంది. ప్రయాణికులు ప్రయాణానికి ముందే రైలు సమయాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.