హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణాలు సాగించేవారికి తీపి కబురు. కేవలం రెండు గంటల్లోనే రెండు నగరాల మధ్య జర్నీ చేయవచ్చు. ఆ దిశగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు నగరాల మధ్య సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్లలో జర్నీకి 11 గంటలు పడుతుండగా.. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే రెండు గంటల్లోనే చేరుకునే ఛాన్స్ ఉంటుంది.