దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ నుండి ముంబైకి ప్రత్యేక రైలును నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు నిజామాబాద్, ఆర్మూర్ మీదుగా ప్రతి మంగళవారం నడుస్తుంది. ముంబై వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. టికెట్లు ఐఆర్సీటీసీ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీసు ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు వరంలాంటిదని అధికారులు తెలిపారు.