హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లేవారికి గుడ్న్యూస్. ఈ రెండు నగరాలకు విమానంలో వెళితే ఎంత సమయం పడుతుందో దాదాపు అంతే సమయంతో ట్రైన్లోనే వెళ్లొచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ కసరత్తు చేస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ రెండు నగరాలకు రైల్వేశాఖ హై స్పీడ్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించింది.