దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ స్టేషన్లో పోర్టబుల్ టికెట్ వెండింగ్ యంత్రాలను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణికులు క్యూలో నిల్చోకుండానే స్టేషన్ ఎంట్రన్స్ వద్ద ఉండే టీటీఈల నుంచి అన్రిజర్వ్డ్ టికెట్లు పొందవచ్చు. నగదు లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు ఉన్న ఈ వ్యవస్థను త్వరలో అన్ని ప్రధాన స్టేషన్లకు విస్తరించనున్నారు.