తెలంగాణలో కొనసాగుతోన్న ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్లు, ఐపీఎస్లు సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం.. ఉత్తర్వులు జారీ చేయగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో రిపోర్ట్ చేసేందుకు మరో రెండు రోజులే ఉండగా.. తాము మాత్రం తెలంగాణలోనే ఉంటామంటూ క్యాట్ను ఆశ్రయించారు. తమకు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలంటూ క్యాట్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆమ్రపాలి సహా ఇద్దరు ఐఏఎస్లు పిటిషన్లు దాఖలు చేయగా.. రేపు విచారణ జరగనుంది.