డయేరియా కేసుల ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్..

1 week ago 2
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసులు ప్రబలిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డయేరియా ప్రబలడానికి కారణమయ్యేలా విధుల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు అధికారుల పూర్తిస్థాయి నివేదిక అనంతరం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Entire Article