ఆహార భద్రత, ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సేవలను మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. త్వరలో ఆయనతో సమావేశమై ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆహార కల్తీ నివారణపై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో హెచ్ ఫాస్ట్ బృందాల ద్వారా తనిఖీలు కొనసాగుతున్నాయని.. ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగంపై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు.