హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలికను షాబాజ్ అనే వ్యక్తి బైక్పై వెంబడించి, బలవంతంగా కిడ్నాప్ చేశాడు. అనంతరం స్థానిక జీహెచ్ఎంసీ పార్కుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సనత్నగర్ పోలీసులు.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.