తిరుమలలో తనకు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వకుండా సాధారణ దర్శనానికి పంపారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. ఇది తనకు జరిగిన అవమానమని పేర్కొన్న ఆయన.. వైఎస్సార్సీపీ నేతల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తిరుమలలో వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.