ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కోసం రూ.10,049 కోట్ల నిధులను విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈనెల 22న డీబీటీ ద్వారా రూ.13 వేల చొప్పున జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. కొత్త అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు 30న అదనపు విడతలో ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.