డిగ్రీ చదివిన మహిళలకు ఏపీ ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ చదివి పట్టణ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు డిజి లక్ష్మి కార్యక్రమం అమలు చేస్తోంది. వారిని డిజి లక్ష్మిలుగా ఎంపిక చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. డిజి లక్ష్మి కియోస్క్ సెంటర్లలో వీరిని నియమించనుంది. అలాగే మరో ఇద్దరు మహిళలకు కూడా ఈ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పించనుంది.