తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి భక్తుల సేవలను టీటీడీ ఆస్పత్రులలో కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఆసక్తిగల వారికి ట్రైనింగ్ అందించి టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులలో వారి సేవలు ఉపయోగించుకోనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో మూడ్రోజులు శిక్షణ అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.