దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జలాశయాల జాబితాలో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ చేరినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) 2025 తనిఖీల ఆధారంగా దీనిని కేటగిరీ-1 (అత్యంత ప్రమాదకరం) కింద వర్గీకరించింది. మేడిగడ్డతో పాటు ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరి, ఝార్ఖండ్లోని బొకారో బ్యారేజీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరమ్మతులు తక్షణమే చేపట్టకపోతే భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 50 ఏళ్లు దాటిన డ్యామ్లు 1,681 ఉన్నాయని, డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది.