గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు తీసుకొని ఆన్లైన్లో పంపమని లేదా పొరపాటుగా మీ ఖాతాలో డబ్బులు పడ్డాయని తిరిగి ఇవ్వమని అడిగితే మోసపోయే ప్రమాదం ఉంది. ట్రక్కు డ్రైవర్లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు అమాయకుల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తున్నారు. రాజిరెడ్డి అనే వ్యక్తి ఇలాగే మోసపోయాడు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.